ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాఠశాలల్లో నాడు-నేడు పథకానికి భారీ విరాళం అందింది. నాడు-నేడు పథకం రెండో విడతలో భాగంగా కంచికచర్ల, వీరులపాడు, తెనాలి, అచ్యుతాపురం, పరవాడ వంటి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన కోసం “కనెక్ట్ టూ ఆంధ్ర” కి లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్ల విరాళం అందించింది. ఈ మేరకు లారస్ ల్యాబ్స్ సంస్థ ప్రతినిధులు బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలుసుకుని విరాళానికి సంబంధించిన చెక్కును, సంబంధించిన పత్రాలను అందజేశారు.
అలాగే నాడు-నేడు పథకం యొక్క మూడు, నాలుగు విడతల్లో ఈ మండలాల్లో మిగిలిన పాఠశాలల్లో నేరుగా పనులు చేపట్టి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు లారస్ ల్యాబ్స్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్ కు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సి.కృష్ణ చైతన్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహరావు, కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ, తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ