ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెల్లూరు నగరంలో 8 రోజుల పాటు జూలై 24 నుంచి జూలై 31 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్డౌన్ ను మళ్ళీ పొడిగించారు. నగరంలో విధించిన పాక్షిక లాక్డౌన్ ఆగస్టు 8 వ తేదీవరకు కొనసాగుతుందని కలెక్టర్ కే.వి.ఎన్ చక్రధర బాబు ప్రకటించారు.
ఈ లాక్డౌన్ సమయంలో అవసరమైన వస్తువుల దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకే అనుమతించనున్నారు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ కోరారు. మరోవైపు జిల్లాలో ఆగస్టు 1 నాటికీ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7875 కి చేరుకుంది. 2635 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 5196 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే కరోనా వలన జిల్లాలో ఇప్పటివరకు 44 మంది మరణించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu