ఏపీలో ఆ నగరంలో మళ్ళీ లాక్‌డౌన్

Andhra Pradesh, Lockdown Implementation in Nellore City Extends, Nellore Coronavirus, Nellore Coronavirus Cases, Nellore Coronavirus News, Nellore Lockdown, Nellore Lockdown News, Nellore Lockdown updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెల్లూరు నగరంలో 8 రోజుల పాటు జూలై 24 నుంచి జూలై 31 వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ ను మళ్ళీ పొడిగించారు. నగరంలో విధించిన పాక్షిక లాక్‌డౌన్ ఆగస్టు 8 వ తేదీవరకు కొనసాగుతుందని కలెక్టర్ కే.వి.ఎన్ చక్రధర బాబు ప్రకటించారు.

ఈ లాక్‌డౌన్ సమయంలో అవసరమైన వస్తువుల దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకే అనుమతించనున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ కోరారు. మరోవైపు జిల్లాలో ఆగస్టు 1 నాటికీ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7875 కి చేరుకుంది. 2635 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 5196 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే కరోనా వలన జిల్లాలో ఇప్పటివరకు 44 మంది మరణించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =