ఏపీలో ఎన్నికలవేడి భగ్గుమంటోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఏపీలో మరో ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు కూడా సమయం ఆసన్నమవుతోంది. ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగియనుంది. ఈలోగా రాజ్యసభకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది.
ప్రస్తుతం ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరుపున.. టీడీపీ తరుపున కనకమేడల రవీంద్ర కుమార్.. బీజేపీ తరుపున సీఎం రమేష్ సిట్టింగ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీరి పదవీకాలం ఈ ఏడాది మార్చితో పూర్తికాబోతోంది. వారిస్థానంలో మరో ముగ్గురు రాజ్యసభ ఎంపీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఈక్రమంలో ఎన్నికల సంఘం ఎలక్షన్స్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకావశం కనిపిస్తోంది.
అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మూడు రాజ్యసభ సీట్ల కోసం ముగ్గురు అభ్యర్థులను వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపు ఖరారు చేశారు. సామాజిక వర్గాలకు పెద్దపీఠ వేసి రాజ్యసభ సభ్యులను జగన్ ఎంపిక చేశారట. వైసీపీ సీనియర్ నేతలు జంగాలపల్లి శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డిలను జగన్ రాజ్యసభ సభ్యులుగా దాదాపు ఖరారు చేశారట. వారిలో జంగాలపల్లి శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. వైవీ సుబ్బారెడ్డి ఓసీ, గొల్ల బాబూ రావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE