ఏపీలో వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఒంగోలులో నేడు ప్రారంభమైన మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మన నాయకుడు స్వర్గీయ ఎన్ఠీఆర్ శత జయంతి ఉత్సవాల సమయంలో మహానాడు జరుపుకోవడం చాలా ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు. పార్టీ పెట్టి 40 సంవత్సరాలవుతోందని, ప్రస్తుతం పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి మహానాడు వేదికగా కీలక నిర్ణయం తీసుకుంటున్నామని, వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్లకి అవకాశాలు ఇస్తామని, యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్లకి అవకాశాలు ఇస్తామని, యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని చంద్రబాబు చెప్పారు.
పార్టీలోని అన్ని స్థాయిల్లో సమర్ధవంతమైన నాయకత్వాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువతకు ఎక్కువ టిక్కెట్లు ఇస్తూనే సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ అధినేత తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం చారిత్రక అవసరమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటంలో ముందుండే యువకులకు పార్టీ టిక్కెట్లు ఇస్తాం అని స్పష్టం చేశారు. టీడీపీలో 70 లక్షల మంది సభ్యులు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వారంతా ముందుండి పార్టీకి విజయం అందించాలని కోరారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రూ.2 లకే కేజీ బియ్యం, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం వంటి సాహసోపేతమైన నిర్ణయాలు, పరిపాలనలో ఎన్టీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ