ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ సినీనటుడు, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. ఈ రోజు (జనవరి 13, గురువారం) మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ముందుగా మధ్యాహ్నం భోజన విరామం సమయంలో సీఎం వైఎస్ జగన్ తో భేటీకి చిరంజీవికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇరువురు కలిసి లంచ్ కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా సినిమా టికెట్ల ధరల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా సినిమా టికెట్ల ధరల అంశంపై సీఎంతో చిరంజీవి చర్చించనున్నారు.
అలాగే కరోనా పరిస్థితుల వలన తెలుగు సినీ పరిశ్రమపై పడిన ప్రభావం, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, షోల పెంపుకు అనుమతి, సినీ, థియేటర్ కార్మికుల సమస్యలు, సినీ సంబంధిత రంగాలకు రాయితీలు సహా పలు కీలక అంశాలను కూడా సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి, చర్చించే అవకాశమునట్టు తెలుస్తుంది. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక చిరంజీవి ఆయనతో భేటీ కావడం ఇది రెండోసారి. సినిమా టికెట్ల ధరల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో తాజాగా వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ