వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు, కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి. ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు” అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మరోవైపు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు దేవాలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు కరోనా మార్గదర్శకాల అనుగుణంగా, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా జనవరి 13 నుండి 22వ తేదీ వరకు పది రోజుల పాటుగా ఉన్న తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు.
ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు, కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి. ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. #VaikuntaEkadashi
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 13, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ