ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తిరుపతిలో కురిసిన భారీ వర్షాలకు వీధులన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో వర్షాలపై ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలు కలిసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ