తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం శ్రీశైలం చేరుకున్న హరీష్ రావు దంపతులకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఈ క్రమంలో స్వామి వారికి, అమ్మవారికి హరీష్ రావు దంపలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి హరీష్రావు దంపతులకు వేదమంత్రాలతో వేదపండితులు, అర్చకులు ఆశీర్వచనాలిచ్చి దీవించారు. ఈ సందర్భంగా హరీష్ రావు దంపతులకు ఈవో లవన్న ఆలయంలోని విశేషాలను స్వయంగా దగ్గరుండి చూపిస్తూ వాటి ప్రాశస్త్యాన్ని వివరించి చెప్పారు. దర్శనం తరువాత మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఈరోజు శ్రీశైలం దర్శనానికి రావడం, ఆ స్వామివారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ