ప్రముఖ సినీనటుడు పృథ్వీరాజ్ మొదటినుంచి వైసీపీ పార్టీలో ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భములో కూడ కొన్ని రోజులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇతర సినీ నటులతో ఒక బృందంగా ఏర్పడి ప్రచారం నిర్వహించారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి జగన్ మోహన్ రెడ్డి పదవులు ఇస్తూ వస్తున్నారు. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ గా పృథ్వీరాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం నియమించింది.
శుక్రవారం నాడు నిర్వహించిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకొని, ఉత్తర్వులు జారీ చేసారు. ఇక టీడిపి ప్రభుత్వ హయాంలో ఎస్వీబీసీ చైర్మన్ గా ప్రముఖ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు నియమితలయ్యారు, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన ఆ పదవికి రాజీనామా చేసారు, ఈ నేపథ్యంలో హాస్యనటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్ కు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
[subscribe]
[youtube_video videoid=bW7fRVh1PU0]