ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పు అంశం హాట్ టాపిక్గా మారింది. 50 మందికి పైగా వైసీపీ సిట్టింగ్లకు షాక్ తగలనున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణ ఫలితాలతో అప్రమత్తమైన జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ల మార్పు వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్లను మార్చే పనిలో పడ్డారు. అటు తమకు ఈసారి టికెట్ రాదని భావించిన కొందరు వైసీపీ నేతలు.. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు టచ్లోకి వెళ్తున్నారు. ఈ పరిణామాల మధ్య రాష్ట్రరాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
ఈక్రమంలో సిట్టింగ్ల మార్పు.. గందరగోళ పరిస్థితులపై మంత్రి రోజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ల మార్పు ఎమ్మెల్యేల స్వయంకృతాపరాధమే తప్ప జగన్మోహన్ రెడ్డి తప్పిదం ఏమీ లేదని రోజా వెల్లడించారు. ఇన్ఛార్జ్ల మార్పుకు సంబంధించిన కారణాలను ముందుగానే జగన్ పలు సందర్భాల్లో చెప్పారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు స్థానికంగా ప్రజల్లో అసంతృప్తి లేకుండా చూసుకోవాలని.. నిత్యం ప్రజల్లో ఉండాలని ముందే సూచించారని అన్నారు. ఈక్రమంలో సిట్టింగ్లకు టికెట్ దక్కకపోతే అది వారి పొరపాటే అవుతుందన్న రోజా.. జగన్ పొరపాటు ఏమాత్రం కాదని వ్యాఖ్యానించారు.
అభ్యర్థులతో రెండు, మూడుసార్లు చర్చించిన తర్వాతే మార్పులు జరుగుతున్నాయన్న రోజా.. ఒంటెద్దు పోకడలు పోవడం లేదని చెప్పారు. కొందరు చివరి నిమిషంలో టికెట్ దక్కుతుందని భ్రమపడి.. ఆ తర్వాత బాధపడితే చేసేదేమీ లేదని రోజా వెల్లడించారు. అలాగే కొందరు మంత్రులకు స్థాన చలనాలపై స్పందించిన రోజా.. ఎన్నికలు సమీపించిన సమయంలో స్థానికంగా ప్రజల మన్ననలు పొందిన వారికి వారి స్థానాలు పదిలంగా ఉంటాయని మంత్రి రోజా వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY