హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు

Nimmagadda Ramesh Kumar Files Contempt Petition in High Court

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ జూన్ 24, బుధవారం నాడు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. తనను తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కార్యదర్శిని పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు. కాగా రమేశ్‌కుమార్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది, త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) తొలగింపు అంశంపై ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోలను రద్దు చేసి, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నే తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలని హైకోర్టు ఇటీవలే కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలో జస్టిస్ ఏఎస్‌ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపి హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − six =