ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆర్.రమేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బాలాపూర్ లో నిర్వహించిన వేలం పాటలో సొంతం చేసుకున్న లడ్డూను ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సీఎం వైఎస్ జగన్ కు అందించారు.
ముందుగా ఆదివారం బాలాపూర్ లో జరిగిన వేలంపాటలో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, నాదర్గుల్ చెందిన మర్రి శశాంక్రెడ్డి లడ్డూను రూ.18.90 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొన్నట్టు తెలిపారు. శశాంక్రెడ్డితో కలిసి లడ్డూను దక్కించుకున్నానని, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు బాలాపూర్ లడ్డూను కానుకగా అందించనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం బాలాపూర్ లడ్డూను సీఎం వైఎస్ జగన్ కు అందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ