టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తుల లెక్క తేలింది కానీ.. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేయాలనుకుంటున్న తెనాలి నియోజకవర్గం విషయం మాత్రం ఎటూ తేలడంలేదన్నవార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై టీడీపీ, జనసేనతో పాటురాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాదెండ్ల మనోహర్కు ఇప్పుడు టికెట్ ఇవ్వకుండా.. ఎమ్మెల్సీని చేద్దామనీ.. కుదిరితే రాజ్యసభకి పంపుదామని చంద్రబాబు పవన్ ముందు ప్రతిపాదనలను ఉంచుతున్నారట. కానీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్కి సీటు ఖరారు చేయడం ద్వారా, పార్టీ శ్రేణులకు, ఇతరులకు జనసేన తరపు నుంచి సరైన సంకేతం పంపడానికి అవకాశం దొరుకుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. నాదెండ్ల మనోహర్ విషయంలో తాను వెనక్కి తగ్గలేనని పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడితో తెగేసి చెప్పారన్న ప్రచారం జరుగుతోంది.
మరోవైపు పొత్తుల్లో భాగంగా సీటు త్యాగం చేయాల్సి వస్తే, తాను ముందుంటానని నాదెండ్ల మనోహర్ ఇప్పటికే పవన్ కళ్యాణ్కి చెప్పేసినట్లు జనసేన వర్గాలలో టాక్ నడుస్తోంది. తెనాలి నుంచి పోటీ చేయాలని తాను అనుకున్నానని.. కానీ అయితే.. పొత్తుల సందర్భంగా త్యాగాలు తప్పకపోవచ్చని మనోహర్ ఇప్పటికే పవన్ ముందు చెప్పారట. ముందుగా తానే సీటును త్యాగం చేస్తే, పార్టీ కేడర్కి మంచి సంకేతాలు వెళతాయని పవన్ ముందు నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారట.అయితే నాదెండ్ల మనోహర్ విషయంలో రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నా.. ఈ మొత్తం వ్యవహారంపై అటు జనసేనగానీ, ఇటు టీడీపీగానీ పెదవి విప్పడంలేదు.
వైసీపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రెండు పార్టీలు.. ఎక్కువ సీట్లు, కచ్చితంగా గెలిచే అవకాశమున్న సీట్లు అంశాలపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మెజార్టీ జనసేనలోని ఆశావహులు, పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యం అని అనుకుంటున్నారట. వాళ్లందర్నీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ స్వయంగా డీల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కిందిస్థాయి వర్గాల నుంచీ కూడా అభిప్రాయాలు సేకరిస్తూ పార్టీ గెలుపుపైనే దృష్టి సారించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE