ప్రముఖ సినీనటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఆగస్టు 29, 30 వ తేదీల్లో తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు, ఈ పర్యటనలో హిందూపురం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రంలోని కరోనా బాధితులకు, వారికి సేవలు అందిస్తున్న యోధులకు రూ.55 లక్షలు విలువైన పరికరాలు, మందులు, పీపీఈ కిట్లు, మాస్కులు పంపిణి చేయనున్నారు. గతంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బసతారకం ట్రస్ట్ ద్వారా రూ.25 లక్షల విలువ చేసే రెండు వెంటిలేటర్లు, 100 పీపీఈ యూనిట్లు, మాస్క్ లు అందజేశారు.
అలాగే కరోనాపై పోరాటానికి తన వంతు ఆర్థిక సాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 50 లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయలు విరాళంగా అందించారు. అంతే కాకుండా సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీ కి కూడా రూ.25 లక్షలు అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్న బాలకృష్ణను అందరూ అభినందిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu