టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు పెను ప్రమాదం తప్పింది. ఈ పర్యటనలో ఆకివీడు నుంచి సిద్ధాపురం వెళ్లేందుకు నారా లోకేష్ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. లోకేష్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్ను అదుపు చేశారు. దీంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించు కున్నారు. లోకేష్ కు ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఘటన అనంతరం కొద్దిసేపటికే నారా లోకేష్ తిరిగి తన పర్యటనను ప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu