బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్ ‘అసాని’.. ఆంధ్రా – ఒడిశా దిశగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారగా, తీరం వెంబడి గంటకు 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తీర ప్రాంత గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నానికి ఆగ్నేయంగా సుమారు 1060 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా బలపడి వాయువ్య దిశలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం, తుఫాన్ విశాఖపట్నానికి 450 కిలో మీటర్లు.. పూరికి దక్షిణంగా 500 కిలో మీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది.
ఇది తదుపరి 48 గంటల్లో బలహీనపడుతుందని, రేపు సాయంత్రానికి ఇది ఆంధ్రా-ఒడిశా తీరానికి మరింత దగ్గరగా రావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయినా దీని ప్రభావంతో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. తుఫాన్ హెచ్చరిక దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభావిత తీరప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలను జారీ చేయడంతో పాటు మత్స్యకారులు ఎవరూ వేటకు సముద్రంలోకి వెళ్లరాదని ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో.. ఉత్తర కోస్తా పరిధిలోని తూర్పు గోదావరి, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో, అలాగే ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో మే 10 నుంచి మే 11 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ