రెండో రోజు ముగిసిన నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర, మూడో రోజు షెడ్యూల్ ఇదే..

Nara Lokesh Yuvagalam Padayatra Second Day Completed TDP Released The Third Day Schedule,TDP Yuvagalam,Janasena Varahi Programs,Will Not Stop,Nara Lokesh Says in Public Meeting at Kuppam,Mango News,Mango News Telugu,Yuvagalam Padayatra 2 0 Route Map,Yuvagalam Padayatra Route Map,Maha Padayatra,Amravati Maha Padayatra,Yuvagalam Farmers Maha Padayatra,Yuvagalam Farmers Maha Padayatra Route Map,Yuvagalam Maha Padayatra,Jana Sena Chief Pawan Kalyan,Campaign Vehicle Varahi,Varahi Vehicle,Varahi Ready For Election Battle,Campaign Vehicle Varahi,Varahi Campaign Vehicle,Campaign Vehicle Varahi News And Live Updates,Varahi Vehicle at Kondagattu Temple,Special Puja for Varahi Vehicle

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకారం చుట్టిన ‘యువగళం’ పాదయాత్ర రెండోరోజు ముగిసింది. యాత్ర మొదటి రోజు 8.5 కిలోమీటర్లు సాగగా.. రెండో రోజు శాంతిపురం మండలంలో 9.3 కిలోమీటర్ల మేర సాగింది. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగారు. ఈ క్రమంలో రెండో రోజు పాదయాత్రను శనివారం ఉదయం 8:30 గంటలకు కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడుపల్లె మండలం, బెగ్గిపల్లె గ్రామస్థులతో లోకేష్‌ సమావేశం అయ్యారు. అలాగే మధ్యాహ్నం కనుమలదొడ్డిలో భోజన విరామం తీసుకుని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇక ఈరోజు రాత్రికి పలమనేరు-కుప్పం హైవే పక్కన బస చేయనున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ రేపు మూడోరోజు నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి షెడ్యూల్ వెల్లడించింది. దీని ప్రకారం.. 3వ రోజు పాదయాత్ర మొత్తం 11 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు పాదయాత్రకు అనుమతులు ఇచ్చినప్పుడే ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని చిత్తూరు జిల్లా పోలీసులు సూచించడంతో.. టీడీపీ నాయకులు 500 మంది పార్టీ వలంటీర్లను, 200 మంది బౌన్సర్లను నియమించుకున్నారు.

నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర 3వ రోజు షెడ్యూల్ ఇలా..

  • ఉదయం 8.00 గంటలకు – శాంతిపురం క్యాంప్ సైట్ నుంచి 3వరోజు యాత్ర ప్రారంభం
  • ఉదయం 8.45 గంటలకు – స్థానిక ప్రముఖులతో సమావేశం
  • ఉదయం 9.45 గంటలకు – బడుమాకళ్ల పల్లెలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం
  • మధ్యాహ్నం 12.15 గంటలకు – కె.గెట్టపల్లి జంక్షన్‌లో స్థానికుల సమస్యలపై చర్చ
  • మధ్యాహ్నం 12.45 గంటలకు – కె.గెట్టపల్లిలో భోజన విరామం
  • మధ్యాహ్నం 3.00 గంటలకు – కె.గెట్టపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు
  • సాయంత్రం 5.00 గంటలకు – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్‌కు చేరిక.. ప్రముఖులతో సమావేశం
  • సాయంత్రం 5.55 గంటలకు – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్‌లో 3వరోజు పాదయాత్రకు విరామం, బస.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 6 =