పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీ పెంచి, ఎత్తిపోతల పథకం చేపట్టాలని భావిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203 విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి పనులు కూడా చేపట్టేందుకు సిద్దమైన ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) లో చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై మే 20, మంగళవారం నాడు స్టే విధిస్తున్నట్టు ఎన్జీటీ ప్రకటించింది. నారాయణపేటకు చెందిన శ్రీనివాస్ పోతిరెడ్డిపాడుపై ఎన్జీటీలో ఫిర్యాదు చేయడంతో జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ ఈ రోజు విచారణ జరిపింది.
విచారణ అనంతరం ఈ పథకం పర్యావరణ ప్రభావంపై నాలుగు శాఖల సభ్యులతో కేంద్ర కమిటీ వేసింది. కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్కు చెందిన వారికి ఈ కమిటీలో సభ్యత్వం కల్పిస్తున్నట్లు ఎన్జీటీ తెలిపింది. పర్యావరణ ప్రభావంపై రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఎన్జీటీ ఆదేశించింది. కమిటీ పూర్తిస్థాయి నివేదిక వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu