ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ముందుగా తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం వైఎస్ జగన్ గుంటూరు చేరుకున్నారు. గుంటూరులోని భారత్పేట ఆరో లైన్లో గల 140వ వార్డు సచివాలయానికి చేరుకొని, రిజిస్ట్రేషన్ చేయించుకుని కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అరగంట పాటుగా సచివాలయంలోనే సీఎం వైఎస్ జగన్ అబ్జర్వేషన్లో ఉన్నారు.
ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై సచివాలయ, వైద్య సిబ్బందితో సీఎం మాట్లాడి పలు సూచనలు చేశారు. మరోవైపు ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా 45 ఏళ్ళు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ 45 ఏళ్ళు పైబడిన వారికీ కరోనా వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని అధికారికంగా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ