ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు, మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉగాది లోపు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతీ లోక్సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందే వైసీపీ తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే కరోనా కారణంగా 2021 జనాభా లెక్కల సేకరణ వాయిదా పడటంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై జాప్యం ఏర్పడింది. కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై రెవిన్యూ శాఖ మొదటగా ప్రాధమిక నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఆ తర్వాత దానిపై సూచనలు, సలహాల కోసం 30 రోజులు గడువు ఇవ్వనున్నట్లు సమాచారం. వచ్చిన నివేదికలను పరిశీలించిన అనంతరం మార్పులు చేర్పులు చేసి తుది నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF