ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం నాడు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా శుక్రవారం అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు జనసేన పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ పెంచిన విద్యుత్తు ఛార్జీలు ఉపసంహరించుకోవాలంటూ వినతిపత్రాలు అందజేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రజల తరపున పోరాడుతామని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఉగాది కానుకగా రూ.1,400 కోట్లు విద్యుత్తు ఛార్జీల వడ్డింపుతో పాటుగా, ట్రూఅప్ ఛార్జీల పేరిట మరో రూ.3 వేల కోట్ల భారాన్ని ప్రజలపై ప్రభుత్వం మోపిందన్నారు. పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు విద్యుత్తు ఫ్రీ ఇచ్చిన హామీ ఏమైందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగులు విద్యుత్తు రాష్ట్రంగా ఉన్నామని, ఇప్పుడు అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నామని పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ