ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ అస్వస్థతకు గురికావడంపై స్పందిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “ప్రముఖ కథానాయకులు శ్రీ రజనీకాంత్ గారు అస్వస్థతతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేరినట్లు తెలిసి బాధపడ్డాను. కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చింది. మనోధైర్యం మెండుగా ఉన్న శ్రీ రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆధ్యాత్మికపరులైన ఆయనకు భగవదనుగ్రహం కలగాలి. ఆయన ఎంతగానో విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు రావాలని కోరుకొంటున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ