ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించారు. తారకరత్నకు ఆయన తండ్రి మోహన కృష్ణ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ముందుగా సోమవారం ఉదయం మోకిలలోని స్వగృహం నుంచి తారకరత్న పార్ధివదేహాన్ని సినీ ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఫిల్మ్ ఛాంబర్ లో పలువురు సినీ, రాజకీయ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తారకరత్న పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం ఫిల్మ్ ఛాంబర్ నుంచి తారకరత్న అంతిమయాత్ర ప్రారంభించారు. తారకరత్న పార్థివదేహం వెంటే వైకుంఠ రథంలో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి వచ్చారు. మహాప్రస్థానానికి చేరుకున్న అనంతరం తారకరత్న పార్థివదేహన్ని బాలకృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు మోశారు. మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలను ఆయన తండ్రి మోహన కృష్ణ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు చంద్రబాబు, బాలకృష్ణ, విజయసాయిరెడ్డి, నారా లోకేష్ సహా ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నందమూరి మోక్షజ్ఞ, పలువురు కుటుంబ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకొని, తారకరత్నకు పూలమాలలు అంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా తారకరత్న పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు. అలాగే తారకరత్నను కడసారిగా చూసేందుకు ఫిల్మ్ ఛాంబర్ కు అభిమానులు భారీగా తరలివచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE