రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రోజురోజుకి వేడెక్కుతుంది. ప్రచారానికి కేవలం మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తమ ప్రచారాన్ని, ప్రణాళికలను మరింత ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 31న మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అథితిగా హాజరుకానున్నారు. కాగా సభా వేదికను ఇంకా ఖరారు చేయాల్సివుంది.
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు సహా రాష్ట్రస్థాయి నేతలంతా గత కొన్ని రోజుల నుంచి మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి గ్రామాల్లో ప్రజలను కలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జేపీ నడ్డా అధ్యక్షతన మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించి, సత్తా చాటి విజయంవైపు దూసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. మునుగోడు సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరుకానుండడంతో భారీ జన సమీకరణపై బీజేపీ నేతలు ఇప్పటికే దృష్టి సారించి, ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY