గుంటూరు జిల్లాలోని పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత రావి వెంకటరమణ విషయంలో వైఎస్సార్సీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ నుంచి రావి వెంకటరమణను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.
“పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ శాసన సభ్యుడు రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకోవడమైనది” అని వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY