కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరానికి సంబంధించి మార్చ్ 23న జరగాల్సిన రెండు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది. మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలను జూన్ 3 న నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నట్టు బోర్డు తెలిపింది. అలాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని బోర్డు సూచించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu