ఏపీలోని అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి అప్పా పాపయ్య మృతి చెందాడు. కొండపై స్వామివారికి పూజలు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి పైనుంచి లోయలోకి పడిపోవడంతో పూజారి పాపయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో కొండపై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శనివారం కూడా కొండపైకి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రమాదవశాత్తు పూజారి మరణంతో కొండపై ఉన్న భక్తులలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ