తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర కొనసాగుతుంది. శనివారం ముందుగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామివారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయపురోహితులు కిషన్ రెడ్డికి వేదాశీర్వచనాలను అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. అనంతరం భువనగిరి మీదుగా మూడో రోజు జన ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించారు. భువనగిరిలో రేషన్ బియ్యం పంపిణీ కేంద్రాన్ని కిషన్ రెడ్డి సందర్శిచారు. అనంతరం ఘట్ కేసర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
మధ్యాహ్నం ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర నగరంలో ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్ పేట్, శ్రీరమణ చౌరస్తా, నారాయణగూడ ఫ్లై ఓవర్, రామ్ నగర్, చిలకలగూడ, సింధీ కాలనీ, సత్యం థియేటర్, యూసఫ్ గూడా చెక్ పోస్ట్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, బంజారా హిల్స్ నెంబర్ 12 (విరించి హాస్పిటల్), నాంపల్లి బాజార్ఘాట్ చౌరస్తా నుంచి నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు కిషన్ రెడ్డి యాత్రను కొనసాగించనున్నారు. అనంతరం బీజేపీ కార్యాలయం వద్ద జరిగే సభలో కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు.మరోవైపు నగరంలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్రకై తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ