చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో పురందేశ్వరి గొంతు అందరికంటే ఎక్కువగా వినిపించింది. ఆయన అరెస్ట్పై ఎప్పటికప్పుడు వైసీపీ సర్కార్ను నిలదీశారు. ఎలాగైనా చంద్రబాబును బయటికి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అటు అమిత్ షా, నారా లోకేష్తో భేటీలో కూడా పురందేశ్వరి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ కూడా పురందేశ్వరి.. చంద్రబాబుకు మద్ధతుగానే మాట్లాడుతున్నారు. అయితే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా ఉండి.. టీడీపీ నేతలకంటే ఎక్కువగా పురందేశ్వరి రియాక్ట్ అవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే పురందేశ్వరి అలా రియాక్ట్ అవ్వడం వెనుక ఓ వ్యూహం ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్సభకు పోటీ చేయాలని పురందేశ్వరి అనుకుంటున్నారట. ఎంపీగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలని భావిస్తున్నారట. ఆమె ఒంటరిగా ఎన్నికలకు దిగితే.. గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారట. అందుకోసమే గతాన్ని పక్కన పెట్టేసి తన చెల్లెలి భర్త చంద్రబాబు ప్రసన్న చేసుకునే పనిలో పడ్డారట పురందేశ్వరి.
ఇక కొద్దిరోజులుగా చంద్రబాబుకు మద్ధతుగా పురందేశ్వరి మాట్లాడడంపై ఎప్పటికప్పుడు విజయసాయి రెడ్డి కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు మరోసారి పురందేశ్వరి అజెండాను విజయసాయి రెడ్డి బయటపెట్టారు. అసలు ఎందుకు పురందేశ్వరి.. చంద్రబాబుకు మద్ధతుగా మాట్లాడుతుందో చెప్పుకొచ్చారు.
పొత్తు లేకపోయినప్పటికీ పురందేశ్వరి.. సొంత పార్టీని గాలికొదిలేసి టీడీపీ పార్టీని తలకెత్తుకుంటున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. స్వార్థం, కపటం పురందేశ్వరి సహజ ఆభరణాలని విమర్శించారు. బావ చంద్రబాబు మద్ధతుతో ఎంపీగా గెలిచి.. బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలని అనుకుంటున్నారని.. అదే బంధుత్వం మాటున పురందేశ్వరి రహస్య అజెండా అని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. అందుకనే చంద్రబాబుపై ఈగ కూడా వాలకుండా పురందేశ్వరి విసనకర్ర ఊపుతున్నారని అన్నారు. మరి ఈ ఆరోపణలపై పురందేశ్వరి రియాక్ట్ అవుతుందా? లేదా? అనేది చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE