విజయవాడ ఎంపీ కేశినేని నాని, టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆదివారం నాడు ఒకరినొకరు ట్విట్టర్లో విమర్శించుకున్నారు, వ్యక్తిగత స్థాయిలో ఒకరినొకరు విమర్శించుకోవడంతో పార్టీ అభిమానులు, ఇతర నాయకులు అవాక్కయారు. ట్విట్టర్లో వీరిద్దరూ గొడవ పడడంపై విజయవాడ నుండి లోక్ సభ కి పోటీ చేసిన వైసీపీ నాయకుడు పొట్లూరి వర ప్రసాద్, ఈ ఇద్దరు నాయకుల చేష్టలను తీవ్రంగా ఖండించారు. ‘ మిమల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా చేసేది ఉందా లేక ట్విట్టర్లో కూర్చుని కాలక్షేపం చేస్తారా?? ఏది ఏమైనా మీ ఇద్దరు చేసుకున్న పరస్పర ఆరోపణలతో ప్రజలంతా ముక్తకంఠంతో ఏకీభవిస్తున్నాము అని ట్వీట్ చేసారు. ఎన్నికల సందర్భంగా తనపై కేశినేని నాని చేసిన ఆరోపణలపై లీగల్ నోటీసు ఇచ్చి పరువునష్టం దావా వేస్తున్నట్టు పొట్లూరి వరప్రసాద్ ప్రకటించారు
చట్టసభలలో బల్లలరిగేలా కూర్చుని
పిర్రలు పెంచడం కాదు…
మిమల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా చేసేది ఉందా లేక ట్విట్టెర్లోనే కూర్చుని కాలక్షేపం చేస్తారా??
ఏదిఏమైనా మీ ఇద్దరు చేసుకున్న పరస్పర ఆరోపణలతో ప్రజలంతా ముక్తకంఠంతో ఏకీభవిస్తునాము.
జైహింద్..— PVP (@PrasadVPotluri) July 15, 2019
కొంతమంది పెద్దలు షో మాస్టర్లులా కాకుండా టాస్క్ మాస్టర్లులా ఉండాలి అని ఈ మధ్యనే చెప్పారు.. వారి సలహాననుసరించి ఆ షో మాస్టర్ కి టాస్క్ మాస్టర్ ఎలా ఉంటాడో చెప్పడానికి చిన్న టీజర్ వదులుతున్నాను..#PVP4Vijayawada pic.twitter.com/jt7YTSy8eV
— PVP (@PrasadVPotluri) July 16, 2019
[subscribe]
[youtube_video videoid=d5VDXtfZ294]