ఏపీలో ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, నేటినుంచి మళ్ళీ కర్ణాటకలో కొనసాగింపు

Rahul Gandhi Bharat Jodo Yatra Ends in AP and Re-Enters Karnataka Once Again Today, Rahul Gandhi Bharat Jodo Yatra Re-Enters Karnataka, Rahul Gandhi Bharat Jodo Yatra Ends in AP, Rahul Gandhi Bharat Jodo Yatra, Mango News, Mango News Telugu, Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi , Rajiv Gandhi, Priyanka Gandhi, Sonia Gandhi, Rahul Gandhi Latest News And Updates, Andhrapradesh News And Live Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో పాదయాత్ర’ శుక్రవారం ఉదయంతో ముగిసింది. ఈ ఉదయం మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్‌ నుంచి ప్రారంభమైన రాహుల్‌ గాంధీ జోడో యాత్ర మాధవరం, తుంగభద్ర వంతెన మీదుగా ముగిసి తిరిగి కర్నాటకలోకి జోడోయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా కర్ణాటక సరిహద్దు మాధవరం బ్రిడ్జి వద్ద రాహుల్ గాంధీకి కర్ణాటక రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఇతర కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.

ఇక రాహుల్ ఏపీ యాత్రలో భాగంగా గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి మఠాన్ని సందర్శించారు. మఠం సంప్రదాయాన్ని అనుసరించి రాహుల్ గాంధీ పంచెకట్టుతో స్వామివారి సన్నిధికి రాగా.. ఆలయ అధికారులు, పూజారులు రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 96 కిలో మీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. కాగా ఈ భారత్‌ జోడో యాత్ర దేశంలోని అనేక రాష్ట్రాలగుండా కొనసాగనుంది. ఈ క్రమంలో ఈనెల 23న తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =