ఏపీలో మూడో రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’

Rahul Gandhi's Bharat Jodo Yatra Continues 3rd Day in Kurnool District Andhra Pradesh, Rahul Gandhi's Bharat Jodo Yatra, Amaravati Farmers, Bharat Jodo Yatra Enters into Andhrapradesh, Bharat Jodo Yatra Route Map Finalized, Mango News, Mango News Telugu, Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi , Rajiv Gandhi, Priyanka Gandhi, Sonia Gandhi, Rahul Gandhi Latest News And Updates, Andhrapradesh News And Live Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ మూడో రోజు కొనసాగుతుంది. అక్టోబర్ 20, గురువారం ఉదయం 6 గంటలకు కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామం నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించి, 9 గంటలకు ముగతి గ్రామం వరకు కోనసాగించారు. విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు హాలహర్వి నుంచి తిరిగి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది. 6.30 గంటలకు కల్లుదేవకుంట గ్రామంలో మూడో రోజు పాదయాత్రను ముగించి కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు.

అలాగే 6.50 గంటలకు రాహుల్ గాంధీ మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంను దర్శించి, రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం శ్రీ సుభుదేంద్ర తీర్థ జీతో కొద్దీ సేపు సమావేశం కానున్నారు. గురువారం రాత్రి కర్నూల్ జిల్లా, మంత్రాలయం మండలం చెట్నిహళ్లిలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. కర్నూల్ జిల్లాలో సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్, కనుమూరి బాపిరాజు, పల్లం రాజు సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 3 =