కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం వీఐపీ బ్రేక్లో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీటేబుల్ బుక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ముందుగా తిరుమల పర్యటనలో భాగంగా బుధవారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్వాగతం పలికారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY