టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు

Razole MLA Rapaka Varaprasad Rao Sensational Comments on TDP Chief Chandrababu Naidu,Razole MLA Rapaka Varaprasad Rao,TDP Chief Chandrababu Naidu,Razole MLA Sensational Comments On TDP,Mango News,Mango News Telugu, AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గురువారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంకలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ.. ఆక్వా రైతులపై చంద్రబాబు నాయుడుది మొసలి కన్నీరని మండిపడ్డ ఆయన రైతులకు నష్టం చేకూర్చాలనే ఆలోచనను విరమించుకోవాలని చంద్రబాబును కోరారు.

ఇక కొన్ని కంపెనీలు కావాలని ఆక్వా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, దీనిలో భాగంగానే టీడీపీకి చెందిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కంపెనీలు ఉద్దేశ పూర్వకంగానే ఆక్వా సాగు ధరలను తగ్గించాయని ఆరోపించారు. ఆక్వా రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా ఉన్నారని, ఒక యూనిట్ విద్యుత్ రూపాయన్నరకే ఇచ్చారని తెలిపారు. అలాగే కోనసీమ జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు చెప్పిన దానికంటే ఎక్కువ ఇళ్ల పట్టాలను సీఎం జగన్ అందించారని, మరి టీడీపీ ప్రభుత్వంలో ఒక సెంటు రాయితీ భూమి అయినా ఇచ్చారా అని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =