ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ శాఖ స్పెషల్ సీఎస్ గా విధులు నిర్వహిస్తున్న అనంతరామ్ ను బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ గా ప్రభుత్వం నియమించింది. అలాగే బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ గా ప్రస్తుతం పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ను జీఏడీ జీపీఎం-ఏఆర్ విభాగానికి స్పెషల్ సీఎస్ గా బదిలీ చేశారు. ఇక ఆ విభాగంలో ఎఫ్ఏసీగా పనిచేస్తున్న శశిభూషణ్ కుమార్ ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు.
ఇక జి.జయలక్ష్మికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అదేవిధంగా ఆమెకు స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కరికాల వలవన్ ను ఆ స్థానం నుంచి రిలీవ్ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ