ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. గవర్నర్ కార్యదర్శిగా ఉన్న ముకేశ్ కుమార్ మీనాను పరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్) ముఖ్యకార్యదర్శిగా నియమించారు. గవర్నర్ స్పెషల్ సీఎస్ గా ఆర్పీ సిసోడియాను నియమించారు. స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గా రవిశంకర్ నారాయణ్ ను నియమిస్తూ, డ్రగ్ కంట్రోల్, కాపీరైట్స్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. అలాగే ఇప్పటివరకు స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గా ఉన్న పీయూష్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కి బదిలీ చేశారు. ఇక సీసీఎస్ఏ అప్పీల్స్ కమిషనర్ గా లక్ష్మీనరసింహంకు, సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా హరి జవహర్లాల్ లకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ