తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల.. చివరికి కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొన్నటి వరకు తెలంగాణ బిడ్డనని చెప్పిన షర్మిల.. ఇప్పుడు ఏపీకి వెళ్లారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించింది. మరి ఏపీలో కాంగ్రెస్కు షర్మిల పూర్వవైభవం తీసుకొస్తారా..? అసలు షర్మిల వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
అయితే షర్మిల పోటీచేయబోయే స్థానాలకు సంబంధించి ప్రస్తుతం రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్నాయి. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తారని.. లేదంటే పులివెందుల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. అయితే గత ఎన్నికల్లో పులివెందుల నుంచి వైసీపీ అధినేత, షర్మిల సోదరుడు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఈసారి కూడా జగన్ అక్కడి నుంచే పోటీచేయనున్నట్లు తెలుస్తోంది.
అటు కడప నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డి ఉన్నారు. ఈక్రమంలో ఇద్దరు సోదరులపై షర్మిల పోటీ చేయాలనుకోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పులివెందుల నుంచి జగన్పై షర్మిల పోటీ చేస్తే రాజకీయం రసవత్తరంగా మారనుంది. నిజంగా పోటీ చేస్తే ప్రచారంలో వైసీపీ సర్కార్పై.. తన సోదరుడు జగన్పై షర్మిల విమర్శలు గుప్పిస్తారా..? ఎలా విరుచుకుపడుతారనేది ఆసక్తికంరగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE