బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. సోము వీర్రాజు నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూలై 27 సోమవారం నాడు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, హెడ్ క్వార్టర్ ఇన్చార్జ్ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. సోము వీర్రాజు నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. కొన్ని నెలల క్రితమే తెలంగాణలో కే.లక్ష్మణ్ స్థానంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఈ నేపథ్యంలో అప్పటినుంచే ఏపీలో కూడా నాయకత్వ మార్పులు జరగవచ్చని వార్తలు వస్తుండగా, తాజాగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతలు దక్కించుకున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu