భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 28, మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,83,156 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 47,701 కరోనా పాజిటివ్ కేసులు, 654 కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 33,425 కి చేరింది. దేశంలో మరణాల రేటు 2.25 శాతంగా ఉంది.
మరోవైపు కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని 9,52,743 మంది డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 4,96,998 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నపటికి కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 64.24 శాతంగా ఉంది. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండగా, ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ 7 వ స్థానంలో కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu