ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు అయింది. విజయవాడ నగరంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ను ఆరోగ్యశాఖ ప్రారంభించింది. ఇలాంటి ల్యాబ్ దేశంలోనే ఇది రెండోది.. అలాగే, రాష్ట్రంలోనే మొదటిది. ఇలాంటి ప్రయోగశాల మరొకటి కేరళలో ఉందని ఆయన తెలియజేశారు. ఈ ల్యాబ్ ఏర్పాటు వలన ఇకనుంచి కొవిడ్ కొత్త వేరియంట్లతోపాటు డెల్టా, ఒమైక్రాన్ రకాలను కూడా హైదరాబాద్, పుణె పంపనవసరం లేకుండా ఇక్కడే గుర్తించే వీలుంటుంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ టెక్నికల్ సపోర్టుతో ఏర్పాటు చేసిన ఈ లేబొరేటరీ జనవరి 1 నుంచి పని చేయడం ప్రారంభించిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ