ఏపీ గవర్నర్‌ హరిచందన్‌ను కలిసిన చంద్రబాబు.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఫిర్యాదు

Chandrababu Met AP Governor Harichandan, Complaint About Name Change Of NTR Health University, AP Governor Harichandan, TDP Chief Chandrababu Naidu, NTR Health University, Dr YSR Health Varsity, TDP Chief Chandrababu Naidu, AP Govt Decision to Name Change of NTR Health University After YSR, Mango News, Mango News Telugu, AP Former CM YS Rajashekar Reddy, Former CM Nandamuri Taraka Rama Rao, YSR Congress Party, Telugu Desham Party, AP Assembly Session

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం సమావేశమయ్యారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్‌ఆర్‌ వర్సిటీగా పేరు మారుస్తూ బుధవారం అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడంపై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట కొందరు టీడీపీ నేతలు బృందంగా వెళ్లారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌ను కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. హెల్త్‌ వర్సిటీ పేరు మారుస్తూ అర్ధరాత్రి జీవో తెచ్చారని, వర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించేంతవరకూ పోరాడతామని స్పష్టం చేశారు. శాసనసభకు వచ్చే ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎంతో బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని చంద్రబాబు అన్నారు.

కానీ ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్తున్నారని ఏపీ సీఏం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. అసలు సీఎం జగన్ ఏ ధైర్యంతో హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చే నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. 1986లో హెల్త్‌ యూనివర్సిటీని ఎన్టీఆర్‌ స్థాపించారని, అనంతరం దాని అభివృద్ధికి ఆయన కృషి చేశారని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదని సీఎం జగన్ సభలో అసత్యాలు మాట్లాడారని, కానీ తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకో మెడికల్‌ కాలేజీ తీసుకువచ్చానని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో 18 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామని, కావాలంటే సీఎం జగన్ రికార్డులు తెప్పించుకుని చూసుకోవాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. ఈ మూడేళ్ళలో కేవలం 3 మెడికల్‌ కాలేజీలకు మాత్రమే గుర్తింపు వచ్చిందని, అసలు తండ్రి వైఎస్‌ఆర్‌, సీఎం జగన్ కలిసి రాష్ట్రానికి ఎన్ని మెడికల్‌ కాలేజీలు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌ కంటే వైఎస్‌ఆర్‌ ఏ విధంగా గొప్ప వ్యక్తి? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =