టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలే తన రాజకీయ జీవితానికి చివరివని తెలిపారు. బుధవారం ఆయన కర్నూలు జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా పత్తికొండలో జరిగిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్షోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు తనను, తన భార్యను అవమానించారని. అందుకే ఆవేదనతో సభలోనుంచి బయటకు వచేశానని తెలిపారు. అయితే వచ్చేముందు అసెంబ్లీలో శపథం చేశానని, మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించానని ఆయన గుర్తు చేశారు.
అందుకే వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే సరే, లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక అవుతుందని సంచలన ప్రకటన చేశారు. ఏపీలో ప్రస్తుతామున్నది కౌరవ సభ అని, టీడీపీని గెలిపించి పంపితే మళ్ళీ గౌరవ సభగా మారుస్తామని చంద్రబాబు అన్నారు. దీనికి ముందుగా కోడుమూరులో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి జిల్లాలో టీడీపీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలునిచ్చారు. కాగా బుధవారం కోడుమూరు, దేవనకొండ, పత్తికొండలో పర్యటించిన చంద్రబాబు నాయుడు గురువారం ఆదోని, ఎమ్మిగనూరులో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE