కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై ఆయన స్పందించారు. రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో బడ్జెట్లో చెప్పలేదన్నారు. అలాగే, ఉద్యోగులకు మొండిచేయి చూపారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అయితే, బడ్జెట్లో ప్రవేశపెట్టిన నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామన్నారు. డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికల్రంగంలో సంస్కరణలు మంచి పరిణామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్లో ఏపీ ప్రయోజనాలను సాధించడంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ