ఆంధ్రప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 35,035 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 6,213 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణాలో 903, గుంటూరులో 830, తూర్పుగోదావరిలో 731, కర్నూల్ లో 679, పశ్చిమగోదావరిలో 642, విశాఖపట్నం జిల్లాలో 518, కడపలో 462, ప్రకాశంలో 324 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,82,583 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14620 కు చేరింది. గత 24 గంటల్లో 10,795 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 21,62,033 చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,05,930 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,25,05,747 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ