అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీకి జరగబోయే ఎన్నికల కోసం టీడీపీ అభ్యర్థుల తరఫున టీడీపీ నేత, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం నాడు ప్రచారం ప్రారంభించారు. ముందుగా టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలతో కలిసి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో హిందూపురం పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పరిచామని, అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ఎద్దేవా చేశారు.
టీడీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, వైసీపీ చేపడుతున్న అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారాలు కొనసాగిస్తామని తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుండి హిందూపురం కంచుకోటగా ఉందని ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో పూర్తి మెజారిటీ సాధించి మున్సిపాలిటీపై తెలుగుదేశం జెండా ఎగరేస్తాం అని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా అభివృద్ధిని పక్కనబెట్టి అన్ని విభాగాలను ప్రైవేటు పరం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ