తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు ఉధృతం చేయనున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి చేపట్టిన దశలవారీ ఉద్యమంలో భాగంగా చంద్రబాబు ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న రైతుల సమస్యలను ఎత్తిచూపడానికి టీడీపీ అధినేత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రేపు (శుక్రవారం, మే 12, 2023) తణుకులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్లు ‘రైతు పోరుబాట’ పేరుతో పాదయాత్ర చేయనున్నారు. కాగా ఈ యాత్రలో స్థానిక టీడీపీ నేతలు, నియోజకవర్గంలోని రైతులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం గ్రామం నుంచి ఈ యాత్ర రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 11 గంటలకు గోటేరు గ్రామం వద్ద కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. తణుకు పట్టణం వరకూ ఈ యాత్ర సాగుతుంది. యాత్ర ముగిసిన తర్వాత తణుకు పట్టణంలో ఆకుల శ్రీరాములు డిగ్రీ కళాశాల వద్ద బహిరంగ సభ జరుగుతుంది. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రమే ఇరగవరం చేరుకోనున్నారు. ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిన్న రాజమండ్రి సహా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. కడియం ఆవ, రాజుపాలెం, కొత్తపేట, ఆవిడిలో పొలాల్లోకి వెళ్లి తడిసిన పంటలను పరిశీలించిన ఆయన, ప్రతి గింజా కొనే వరకూ జనసేన పోరాటం చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE