అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన సోమవారం తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీలోని రెవెన్యూ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ, భూ గర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలో అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యంలో వార్షిక ఆదాయ వసూళ్లు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సీఎం జగన్ అధికారులకు చేసిన కొన్ని కీలక సూచనలు..
- బెల్టు షాపులు ఎత్తేయడం, మద్యం ధరలు పెంచడం ఇత్యాది కారణాల వలన రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గింది.
- పన్ను వసూళ్లలో మరింత సమర్థత సాధించేటప్పుడు ఎలాంటి లీకేజీలు ఉండకూడదు.
- రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పన్నుల వసూళ్లలో లొసుగులను, లీకేజీలను పూడ్చుకుంటూ పారదర్శకత పాటించాలి.
- అవసరమైతే పన్నుల వసూళ్లలో లీకేజీలను అరికట్టేందుకు ప్రొఫెషనల్ ఏజెన్సీల సేవలను వినియోగించుకోవాలి.
- పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వ పాలసీల సౌలభ్యం మరియు పారదర్శకతను అందించాలి.
- తద్వారా పన్నుల సజావుగా వసూలు చేయడానికి తప్పనిసరి అని ఆయన అన్నారు.
- స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (యస్ఈబీ) ఆధ్వర్యంలో అక్రమ మద్యం తయారీపై దృష్టి సారించాలి.
- అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తరచుగా ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలి.
- కల్తీ మద్యం, బెల్టు షాపులపై గ్రామాల్లో పని చేస్తున్న మహిళా పోలీసుల నుంచి రోజువారీ నివేదికలు తెప్పించుకోవాలి.
- వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
- శాశ్వత భూ హక్కు, భూ సర్వే జరుగుతున్న గ్రామాలు మరియు వార్డుల్లో సబ్ రిజిస్ట్రార్ భవనం, సేవలు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయాన్ని పెంచడంతోపాటు లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
- అందుబాటులో ఉన్న సేవలను పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడానికి గ్రామ సచివాలయాలు మరియు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాలలి.
- అలాగే ప్రజల నుంచి ఫిర్యాదుల సేకరణకు సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
- రాష్ట్రంలోని అన్ని గనులు రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించుకోవడంలో తోడ్పడాలి.
- ఇందుకోసం మైనింగ్ లీజుదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE