పార్టీని ప్రక్షాళన చేయటం ఇక్కడినుంచే ప్రారంభిస్తా అని కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. కుప్పం మున్సిపాలిటీ అభ్యర్థులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, వార్డుల వారీగా రహస్య నివేదికలు ఇవ్వాలని వారికి సూచించారు. నాయకుల అతి విశ్వాసం వల్లే కుప్పంలో ఓడిపోయామని, మరోసారి ఇలా జరుగకుండా చూసుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. ఇకనుంచీ పార్టీలో సమర్ధులకే పట్టం కడతామన్నారు. తనను కలవటం కాదని, నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలపై పోరాటాలు చేయాలని నాయకులకు సూచించారు. అప్పుడు పార్టీయే పిలిచి పదవులిస్తుందని చెప్పుకొచ్చారు.
క్రిందిస్థాయి కార్యకర్తలను తరచుగా కలుసుకోవాలని, వారి సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాని సూచించారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారని, వారందరిని ఏరిపారేస్తానని హెచ్చరించారు. ఇతర పార్టీలనుంచి వచ్చిన వారికి కాకుండా పార్టీలో ఉండే సమర్ధులకే పెద్దపీట వేస్తానని ఆయన కార్యకర్తలకు హామీనిచ్చారు. కుప్పంలో పార్టీ బలపడటానికి స్థానికంగా ఉన్న సమర్ధ నాయకులతో ఒక కమిటీ వేస్తానని ఆయన తెలిపారు. జీవితంలో బాంబులకే భయపడలేదని, రాజకీయ నేరగాళ్లకు భయపడతామా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి క్రిందిస్థాయి కార్యకర్తల నుంచి పెద్దస్థాయి నాయకుల వరకూ పార్టీలో ఉన్న అందరూ సమిష్టిగా పనిచేయాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ