ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వరుసగా జరగుతున్న టీడీపీ కార్యకర్తల హత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇవన్నీ రాజకీయ హత్యలేనని, పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే ఇన్ని హత్యలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ నేత జల్లయ్య హత్య ఘటనను వివరిస్తూ.. ఈ హత్య వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని బాబు ఆరోపించారు. వైసీపీ వర్గీయుల దాడిలో మరణించిన జల్లయ్య మృతదేహానికి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం ఎందుకు చేయించారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
ఆస్పత్రి నుంచి జల్లయ్య మృతదేహం ఎక్కడికి తరలించారో కూడా సమాచారం లేదని, సొంత గ్రామంలో దహన సంస్కారం చేసే అవకాశం కూడా ఇవ్వరా అని లేఖలో చంద్రబాబు ప్రశ్నించారు. అంతేకాకుండా అంత్యక్రియలకు వెళ్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే ఈ హత్య జరిగేది కాదని, ఇప్పటివరకు మాచర్లలో 5గురు బీసీ నేతలను హత్య చేశారని తెలిపారు. మాచర్లలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై ప్రత్యేక కోర్టుతో విచారణ చేపట్టాలని, హంతకులకు మరణశిక్ష విధించేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. కాగా జల్లయ్య కుటుంబానికి టీడీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF