అక్టోబర్ 17 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి ఛైర్మన్, ఆలయ అధికారులు, అర్చకులుతో కలిసి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ను వారు ఆహ్వానించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu